- డాక్టర్ వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్యసేవ
పశువులకు అంబులెన్స్ సేవలు మరింత విస్తృతం - రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ.240.69 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్ల ఏర్పాటు.
- ఇప్పటికే మొదటి దశలో రూ.129.07 కోట్ల వ్యయంతో 175 పశుఅంబులెన్స్ల ద్వారా 1,81,791 పశువులను ప్రాణాపాయం నుంచి రక్షించి 1,26,559 మంది పశు పోషకులకు లబ్ధి.
- రెండో దశలో భాగంగా రూ.111.62 కోట్ల వ్యయంతో ఇవాళ మరో 165 పశు అంబులెన్స్ వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్.జగన్.
- డాక్టర్ వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్యసేవ వాహనం ఎక్కి పనితీరు, సేవలను స్వయంగా పరిశీలించిన సీఎం.