తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. దేశంలో కరోనా అప్రమత్తత, వైకుంఠ ద్వార దర్శనం, కొత్త ఏడాది సందర్భంగా భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అటు డిసెంబర్ 31, జనవరి 1న సర్వదర్శనం టోకెన్లను రద్దు చేశామన్న ఆయన.. జనవరి 2, 3 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోమని పేర్కొన్నారు.