ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. గత పది ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. కాగా ప్రస్తుతం అదే జిల్లాలో వెంకటగిరి నుంచి ఆనం రాంనారాయణరెడ్డి https://www.facebook.com/ramanarayanareddy.anam ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఆనం రామనారాయణరెడ్డి 2004 2009లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఆయన మరణించాక రోశయ్య కిరణ్ కుమార్రెడ్డి మంత్రివర్గాల్లో ఆర్థికం వంటి కీలక శాఖలకు మంత్రిగా చక్రం తిప్పారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా ఆయన పేరు వినిపించింది. ఆ సమయంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడి వేరే పార్టీ ఏర్పాటు చేసినప్పుడు జగన్పై ఘాటు విమర్శలు చేసినవారిలో ఆనం రాంనారాయణరెడ్డి ఒకరు. అయితే మారిన పరిస్థితుల్లో 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో చేరిన ఆనం రాంనారాయణరెడ్డి వెంకటగిరి నుంచి గెలుపొందారు.అయితే ఆయనకు వైఎస్సార్సీపీలో ఎలాంటి ప్రాధాన్యత లభించలేదనే అసంతృప్తి ఉందని అంటారు. ఆయన సీనియారిటీని గుర్తించి జగన్ తగిన పదవి ఇవ్వలేదని ఆనం అనుచరుల్లోనూ అసంతృప్తి ఉందని అంటుంటారు.ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే నెల చివరలో టీడీపీ మహానాడు సందర్బంగా ఆనం రాంనారాయణరెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి.. నారా లోకేష్ తో భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. కైవల్యా రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని.. గతంలో తన తండ్రి గెలిచిన ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి.
మరోవైపు తన కుమార్తె కైవల్యా రెడ్డిని ఆనం రాంనారాయణరెడ్డే టీడీపీలోకి పంపుతున్నారని గాసిప్స్ వినిపించాయి. అంతేకాకుండా గత కొంతకాలం ఆనం రాంనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారులను సైతం తూర్పూరబడుతున్నారు. ఆనం రాంనారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లనున్నారని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
జగన్ మొదటి మంత్రివర్గ విస్తరణలో నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. ఇక రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఆనం రాంనారాయణరెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ దిశగా ఆయనైతే ఎక్కడా బయటపడలేదు.
మరోవైపు ఆయన వైఎస్సార్సీపీలో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు టికెట్ వైసీపీ ఆఫర్ చేసినట్లు తెలిసింది.. ఆత్మకూరు లో మేకపాటి విక్రమ్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత వలన ఆయనను 2024 లో ఉదయగిరి నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం ఆలోచన గా ఉంది.అయితే ఆయన మళ్లీ నెల్లూరు నగరంలో అడుగుపెట్టి 2024 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆనం రామనారాయణరెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం.వైసీపీ లో ఉండి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారా లేక టీడీపీ నుంచి నెల్లూరు సిటీ నుంచి రంగంలోకి దిగుతారో ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారొ అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..