టిటిడి ఈఓ(ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది.
అనంతరం బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈఓ(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం, వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం, జెఈఓ సదా భార్గవి, కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని ఆయనకు అందించారు.ఈ కార్యక్రమంలో సివిఎస్వో నరసింహ కిషోర్, డెప్యూటీ ఈఓలు కస్తూరి బాయి, రమేష్ బాబు, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
